హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గులాని సాయిలు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గులాని సాయిలు, టీపీసీసీ అధ్యక్షులను శాలువాతో సత్కరించి, పార్టీ బలోపేతం కోసం జరుగుతున్న కార్యక్రమాలపై వారితో చర్చించారు. పార్టీ ఎస్సీ సెల్ విభాగం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆయనకు వివరించారు.



